Wednesday, 8 April 2015

ఉత్తరావృత శంఖం

Conch
ఉత్తరావృత శంఖం
శ్రీ కృష్ణుని గురువు సాందీపుడు.సాందీపుడు బలరామ కృష్ణులకు వేదాలు, వేదాంగాలు, ధనుర్వేదం, తంత్రం, ధర్మశాస్త్రాలు, న్యాయం, తర్కం, రక్షకత్వం, రాజవిద్యాలు…….. మొదలగుఅరవై నాలుగు విద్యలను అరవై నాలుగు రోజులలో నేర్పుతాడు. ఆ గురువుగారిని గురుదక్షిణగా ఏమి ఇవ్వాలి అని అడిగారు.బలరామకృష్ణులకు ఉన్న మానవాతీతమైన బుద్ది వైభవాన్ని చూసి బార్యతో ఆలోచించి ప్రభాస తీర్ధంలో సముద్రములో పడిపోయిన తమ పుత్రున్ని ఇవ్వమని అడుగుతారు.శ్రీకృష్ణుడు సముద్రుని వద్దకు వెళ్ళి స్నానం చేస్తుండగా ఒక తరంగం వచ్చి మా గురు పుత్రులను మింగిందట ఆ పిల్లవాన్ని ఇవ్వమని అడుగుతాడు.
సముద్రుడు ఆ పిల్లవాన్ని నేను అపహరించలేదు.ఇందులో మునిగితే ఇందులో ఉన్న పంచజనుడు అనే శంఖ రూపంలో ఉన్న రాక్షసుడు అపహరించాడు.వెంటనే శ్రీకృష్ణుడు నీటిలో ప్రవేశించి ఆ రాక్షసుడుని సంహరించి అతని గర్బాన్ని చీల్చగా గురు పుత్రుడు లేకపోవటాన్ని గమనిస్తాడు.అతని పొట్టలో ఒక శంఖం దొరుకుతుంది.ఆ శంఖాన్ని తీసుకొని శ్రీకృష్ణుడు యమలోకానికి వెళ్ళాడు.శ్రీకృష్ణుడు చేతిలో ఉన్న శంఖాన్ని పూరించాడు.ఆ ద్వని విన్న యముడు ఎదురుగా వచ్చి పూజించి ఏమి ఆజ్ఞా అని అడుగుతాడు.మా గురు పుత్రుడు చేసుకున్న కర్మకు అనుగుణంగా మా గురుపుత్రుడ్ని ఇక్కడికి తీసుకొని వచ్చినట్లు తెలుసు.నా ఆజ్ఞను వహించి ఆ పిల్లవాన్ని తీసుకు రమ్మని యముడిని శ్రీకృష్ణుడు కోరతాడు.అప్పుడు యముడు ఆ పిల్లవాణ్ణి తెచ్చి ఇస్తాడు.యమ లోకానికి వెళ్ళిన వారు కూడా శంఖ శబ్ధాన్ని వింటే తిరిగివస్తారు.వైకుంఠాన్ని చేరుతారు.ఇది శంఖానికి ఉన్న ప్రాదాన్యత.
దక్షిణావృత శంఖాలను పూజకు మాత్రమే ఉపయోగిస్తారు. ఉత్తరావృతాన్ని ఊదుటకు ఉపయోగిస్తారు. ఉత్తరావృత శంఖానికి ఎడమప్రక్క ఆవృతం(కడుపు) ఉంటుంది.శంఖాన్ని తూర్పుదిక్కుకి పట్టుకున్నప్పుడు ఉత్తరం వైపు ఆవృతం ఉంటుంది కాబట్టి ఈ శంఖాన్ని ఉత్తరావృత శంఖం అంటారు.విజయానికి సంకేతంగా శంఖాన్ని పూరిస్తారు. శంఖ ధ్వని విజయానికి, సమృద్ధికి, సుఖానికి, కీర్తి ప్రతిష్ఠలకు, లక్ష్మి ఆగమనానికి ప్రతీక.
ఉత్తరావృత శంఖాన్ని దుకాణాలలోను ఆఫీసుల్లోను ఫ్యాక్టరీలలోను స్థాపించి అభివృద్ధిని పొందుతున్నారు. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం కేవలం ఆద్యాత్మికపరమైన ప్రయోజనాలే కాకుండా శాస్త్రీయ మరియు ఆయుర్వేద ప్రయోజనాలు కూడా ఉంది.శంఖాన్ని ఊదినప్పుడు స్వచ్చమైన గాలి ఊపిరితిత్తులకు చేరుతుంది.మలినాలతో కూడిన గాలి బయటకు వస్తుంది. ఉత్తరావృత శంఖాన్ని ఊదటం వలన ఊపిరితిత్తుల వ్యాదులు నశించటమే కాకుండా ప్రేగులకు సంబందించిన వ్యాదులు నివారణవుతాయి.ఎవరికైనా మాటలు తడబడటం,నత్తి,గొంతు సంబంద సమస్యలు ఉన్నవారు ఉత్తరావృత శంఖాన్ని పూరించిన, ఉత్తరావృత శంఖ ద్వని విన్న గొంతు సంబంద వ్యాదులు నివారణవుతాయి.ఆస్తమా ఉన్నవారు క్రమం తప్పకుండా ఉత్తరావృత శంఖాన్ని పూరించినట్లైతే వ్యాది నుండి నివారింపబడతారు.
శాస్త్రవేత్తలు అభిప్రాయానుసారం ఉత్తరావృత శంఖ ధ్వని వల్ల వాతావరణంలో హాని చేసే కీటకముల నాశనం జరుగుతుందని -అనేక ప్రయోగాలు చేసి నిరూపించారు.జర్నన్ శాస్త్రవేత్తల ప్రయోగాల పలితంగా ధైరాయిడ్,హార్మోన్ లోపాల వంటి వ్యాదులు నివారింపబడతాయని ప్రయోగాత్మకంగా నిరూపించారు.ఆశ్చర్యకరంగా కొన్ని ప్రాంతాలలో శంఖాన్ని పూరించినప్పుడు వెలువడే శబ్ధ కెరటాలు పరిసరాల్లో నివసించే ప్రజలకు ప్లేగు,కలరా వంటి వ్యాదులు ప్రబలవని నమ్ముతారు.ఉత్తరావృత శంఖాన్ని పూరించిన ఇంటిలో గాని,వ్యాపారసంస్ధలలో గాని నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.ఉత్తరావృత శంఖాన్ని పూజ మందిరంలో గాని,ఇంటికి ఉత్తర దిక్కున గాని ఉంచిన సమస్త వాస్తు దోషాలు నశిస్తాయి.


No comments:

Post a Comment