Monday, 13 April 2015

పగిలిన మడిమలను తగ్గించేందుకు ఇంట్లో ఉండే సహజ ఔషదాలు

పగిలిన పాదాలు లేదా మడిమలను వైద్యశాస్త్ర ప్రకారం, "హీల్ ఫిషర్స్" (పగిలిన మడమలు) అంటారు. ఇవి చూడటానికి అసహ్యంగా మాత్రమే కాకుండా, నొప్పిని కూడా కలుగ చేస్తుంటాయి. పొడి చర్మం వలన పగిలిన మడిమలు మరియు ఇతర చర్మ సమస్యలను కలిగిస్తాయి, వీటిని ఇంట్లో ఉండే సహజ ఔషదాల ద్వారా సమర్థవంతంగా తగ్గించవచ్చు. పాదాలు పొడిగా ఉండటం మరియు ఒత్తిడికి గురవటం వలన పాదాలు పగుళ్ళకు లోనవుతాయి. సరైన విధంగా చికిత్స జరిపించని ఎడల, రక్త స్రావాలకు లోనవుతాయి. కావున వీలైనంత త్వరగా తగిన చికిత్సను అందించటం మంచిది.

పగిలిన మడిమలకు ఇంట్లో ఉండే ఔషదాలు
పగిలిన మడిమలకు చాలా మంది, మార్కెట్ లో లభించే అల్లోపతి మందులను వాడతారు. వీటి వలన ఫలితం పొందినప్పటికీ, ఇంట్లో ఉండే సహజ ఔషదాలు సహజంగా వాటికి తేమను అందించి, శాశ్వతంగా తగ్గించి వేస్తాయి. పగిలిన మడిమలను తగ్గించే, సహజ ఔషదాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
అరటిపండు గుజ్జు
అరటిపండులో గుజ్జు పగిలిన మడిమలకు, సహజ తేమలను అందించి, పొడితత్వాన్ని దూరం చేస్తాయి. తాజా అరటిపండును తీసుకుకొని, దంచి గుజ్జుగా మార్చి, పొడిగా ఉన్న లేదా పగిలిన పాదాలకు పూయండి. ఇలా కనీసం 10 నిమిషాల పాటూ ఉంచి, గోరు వెచ్చని నీతితో కడిగి వేయండి. పొడిగా లేదా పగిలిన మడిమలకు, అరటిపండు గుజ్జును రోజు వాడటం వలన, పాదాల చర్మాన్ని మృదువుగా మార్చి, పగుళ్ళను తగ్గించి వేస్తాయి.
మినరల్ ఆయిలో నానబెట్టడం
పాదాలలో ఉండే గ్రంధులు నూనెలను ఉత్పత్తి చేయకపోవటం వలన, మడిమలు పొడిగా మారతాయి. పొడితత్వాన్ని దూరం చేయటానికి, రోజు పడుకునే ముందు, పాదాలకు కావలసిన తేమను అందించాలి. దీని కోసంగానూ, టబ్ లో మినరల్ ఆయిల్ మరియు గోరువెచ్చని నీటిని సమాన మొత్తంలో కలపాలి. ఈ మిశ్రమంలో పాదాలను కనీసం 10 నిమిషాల పాటూ నానబెట్టాలి. వేడినీరు సమర్థవంతంగా పొడితత్వాన్ని దూరం చేస్తాయి. పాదాలకు తేమ పూర్తి రాత్రి అందించబడటానికి, కాటన్ సాక్స్ లను ధరించి పడుకోండి.

రైస్, తేనె మరియు వెనిగర్
ఒక కప్పు రైస్ ను రుబ్బించి, దీనికి తేనె మరియు వెనిగర్ ను కలపండి. తరువాత, గోరు వెచ్చని నీటిలో 10 నిమిషాల పాటూ పగిలిన మడిమలను నానబెట్టి, ఆరేవరకు వేచి ఉండండి. రుబ్బి తయారుచేసిన మిశ్రమాన్ని, పగిలిన పాదాలకు పొడి చర్మం పోయే వరకు రాయండి. పాదాలకు కావలసిన తేమను తేనె అందిస్తుంది. రైస్ మరియు వెనిగర్ ఎక్సోఫోలేట్ గుణాలను కలిగి ఉన్నందు వలన, పాదాల పొడితత్వాన్ని శక్తివంతంగా దూరం చేస్తాయి.
పెట్రోలియం జెల్లీ, నిమ్మరసం

ఒక చెంచా పెట్రోలియం జెల్లీని, కొన్ని చుక్కల నిమ్మరసానికి కలపండి. ఈ ఔషదాన్ని వాడే ముందు, పగిలిన మడిమలను వేడి నీటిలో 10 నిమిషాల పాటూ నానబెట్టండి. నానబెట్టిన పాదాలను తువ్వాలతో తుడిచి, ఎండిన తరువాత, పైన తెలిపిన ఔషదంతో మసాజ్ చేయండి. తేమ పూర్తి రాత్రి అందించబడటానికి, కాటన్ సాక్స్ లను ధరించండి. ఈ ఔషదాన్ని క్రమంగా వాడటం వలన పొడితత్వం మరియు పాదాల పగుళ్ళు తగ్గటమే కాకుండా, పాదాల చర్మం మృదువుగా మారుతుంది.

పొడి చర్మాన్ని కలిగి ఉంటే మాత్రం, మీ పాదాలు ఖచ్చితంగా పగిలే అవకాశాలున్నాయి. మీ శరీర బరువు పూర్తిగా పాదాలపై పడటం వలన కూడా పాదాలు పగుళ్ళుకు గురవుతాయి. సహజ ఔషదాలు పాదాల పగుళ్ళను సమర్థవంతంగా తగ్గించి, పాదాల చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

No comments:

Post a Comment